. < 1 minute

ఈ సభను రోల్ మోడల్  గా తీసుకుంటాం : మంత్రి సీతక్క

Caption of Image.
  • కరీంనగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభినందించిన మంత్రి సీతక్క

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో మహిళల ఆరోగ్యం, వారి సమస్యల పరిష్కారానికి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభ మంచి కార్యక్రమమని, ఈ కార్యక్రమాన్ని రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుని రాష్ట్రమంతా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పంచాయతీరాజ్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ(సీతక్క) తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో ఆఫీసులో ఈనెల 4, 5న మేధోమథన సదస్సు  నిర్వహించారు.

ఈ సదస్సులో కరీంనగర్ జిల్లాలో అమలు చేస్తున్న శుక్రవారం సభ గురించి కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీతక్క అభినందించారు. ఈసందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడీపీవోలు కలెక్టర్ పమేలా సత్పతిని, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సత్కరించారు.

బడిబాటను  సక్సెస్  చేయాలి కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఈనెల 6 నుంచి 19 వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం  కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఐసీడీఎస్ సిబ్బందితో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్ ప్రదర్శన, కరపత్రాల పంపిణీ ద్వారా డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఈవో మొండయ్య, డీడబ్ల్యూవో సరస్వతి, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.