
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను బెదిరించిన వ్యక్తిని ఘజియాబాద్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది. కొత్వాలి ప్రాంతం నుంచి శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు తన భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఉన్నప్పుడు ఫోన్ చేసి బెదిరించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను చంపేస్తామని హెచ్చరించాడు. బెదిరింపులకు ఉపయోగించిన సిమ్ కార్డు గోరఖ్పూర్ చిరునామాతో నమోదు చేయబడింది. సిమ్ కార్డు నిందితుడి బంధువు పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.
READ MORE: Hyderabad: సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి
ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తానంటూ త్రిపాఠి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. అనంతరం రంగంలోకి దిగిన బృందాలు నిందితుడిని కొనుగొన్నాయి.
READ MORE: Nirmala Sitharaman: టీచర్గా మారిపోయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్