
ఈ అరుదైన రోజ్ యాపిల్ గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో గుండెకు కావలసిన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, సోడియం వంటివి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తరచూ రోజ్ యాపిల్ తీసుకోవటం వల్ల గుండెపోటు, బీపీ, పక్షవాతం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు..రోజ్ యాపిల్లో జాంబోసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాదు.. ఈ పండులోని గుణాలు గ్లూకోజ్ వినియోగాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుందని చెబుతున్నారు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది.
ఇందులో విటమిన్ C రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్,బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. నీటి శాతం అధికంగా ఉండటం డీహైడ్రేషన్ను నివారిస్తుంది. తరచూ ఈ పండును మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రోజ్ యాపిల్ జీర్ణ వ్యవస్థ మెరుగు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండు మలబద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గించేస్తుంది. రోజ్ యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన చర్మం కాంతివంతంగా, యవ్వనంగా, మెరిసేలా ఉంచుతుంది.
రోజ్ యాపిల్ కెలొరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, బి, సిలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. రోజ్ యాపిల్లోని నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతుంది.
(నోట్: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..