నేరేడు పండ్లు.. ఈ పేరు వినగానే చాలామందికి నోరూరుతుంది. ఎందుకంటే నోటికి రుచిగా, తియ్యగా, పుల్లగా ఉంటాయి. ఈ సీజన్లో నేరేడు పండ్లు మార్కెట్లో, రోడ్లమీద ఎక్కువగా దర్శనమిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండ్లను తినడానికి చాలా ఇష్టపడతారు. అందుకే వీటికి చాలా డిమాండ్ ఉంటుంది.
నేరేడు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి రక్త లోపాన్ని తీరుస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి. చెడు కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి ఈ పండు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే, ఈ పండ్లు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు నేరేడు పండ్లు తీసుకోకూడదు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు నేరేడు పండ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే నేరేడు పండ్లలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. తద్వారా వీటిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య పెరుగుతుంది.
కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా నేరేడు పండ్లు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ పండ్లలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాలేయ వ్యాధులు ఉన్న రోగులకు ఎంతో హానికరం.
నేరేడు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో నేరేడు పండ్లు అధికంగా తీసుకుంటే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మలబద్ధకం ఉన్నవారు వీటిని తీసుకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు ఈ పండ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ పండ్లలో ఒత్తిడి వ్యవస్థను ప్రభావితం చేసే లక్షణాలు ఉంటాయి. నేరేడు పండ్లు ఎక్కువగా తింటే గర్భిణీ స్త్రీల రక్త ప్రవాహం ప్రభావితం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నోట్ : పైన సేకరించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పబ్లిష్ చేస్తున్నాము. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.