. 2 minutes

గొంతెండిపోతోంది- పంటలు ఎండిపోతున్నయ్.. ప్లీజ్ మాకు నీళ్లివ్వండి: పాక్ రిక్వెస్ట్స్

Caption of Image.

Indus Water: ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు భారత్ వాడుతోంది వాటర్ బాంబ్. దాయాది పాక్ తన ఉగ్ర కార్యకలాపాలను మానుకోకపోవటంతో భారతదేశం సింధూ జలాల అగ్రిమెంట్ పునరుద్ధరణపై ఎలాంటి చర్చలు జరపటం లేదు. పహెల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులపై దాడులు చేసిన తర్వాత మోదీ సర్కార్ దీనిని రద్దు చేస్తూ పాకిస్థానుకు నీటిని అందకుండా నిలిపివేసింది.

ప్రస్తుతం పాకిస్థాన్ నీటి ఎద్దడి సమస్యలను చూస్తోంది. కనీస అవసరాలైన తాగు, సాగు అవసరాలకు సైతం నీరు లభించకపోవటంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏకంగా విమానాశ్రయాల్లో కూడా నీటి కొరత భారీగా ఏర్పడినట్లు చాలా మంది అక్కడి సెలబ్రిటీలు కూడా వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్టాజా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కి ఇప్పటికే 4 లేఖలు రాశారు. ఈ లేఖల్లో భారత్ సింధు జలాల నిలిపివేతపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. 

నీటి విషయంలో భరత్ ఏకపక్షంగా వ్యవహరించటం సరైదనది కాదంటూ అందులో ఆందోళన వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని నిలుపుదల చేయాలనే తన నిర్ణయాన్ని భారతదేశం ఏప్రిల్ 24న పాకిస్తాన్‌కు అధికారికంగా తెలియజేసిందని వర్గాలు తెలిపాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నందున తాము అగ్రిమెంటును పాటించాల్సిన అవసరం లేదని భారత వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ దెబశ్రీ ముఖర్జీ చెప్పారు. పాక్ నుంచి నీటి విషయంలో వరుస విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ ఇండియా మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించటం పాకిస్థాన్ ను ప్రమాదం అంచుకు నెట్టేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న నీటి సమస్యలు పాక్ ఆర్థిక పతనానికి దారితీస్తున్నాయి. 

వాస్తవానికి పాక్ ఆర్థిక వ్యవస్థలో జీడీపీ 25 శాతం సింధు జలాలపైనే ఆధారపటంతో ప్రస్తుతం పాక్ ఆందోళనలకు కారణంగా తెలుస్తోంది. ఇది పాక్ నేతలకు వాస్తవ నష్టాలపై ఆందోళనలు కలిగిస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో పాకిస్థాన్ లోపల అంతర్గత ప్రజా వ్యతిరేకత, తిరుగుబాటుకు దారితీస్తుందని తెలుస్తోంది. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ పశ్చిమ నదుల నుంచి వస్తున్న నీటిలో దాదాపు 80 శాతం పాకిస్థాన్ అవసరాలకు అందిస్తూ వస్తుంటే పాక్ మాత్రం దానికి బదులుగా ఇండియాలోకి ఉగ్రవాదులను పంపటంపై ప్రస్తుతం మోదీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. 

ప్రస్తుతం పాకిస్థాన్ నీటి ఎద్దడి సమస్యలను చూస్తోంది. కనీస అవసరాలైన తాగు, సాగు అవసరాలకు సైతం నీరు లభించకపోవటంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏకంగా విమానాశ్రయాల్లో కూడా నీటి కొరత భారీగా ఏర్పడినట్లు చాలా మంది అక్కడి సెలబ్రిటీలు కూడా వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్టాజా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కి ఇప్పటికే 4 లేఖలు రాశారు. ఈ లేఖల్లో భారత్ సింధు జలాల నిలిపివేతపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. 

నీటి విషయంలో భరత్ ఏకపక్షంగా వ్యవహరించటం సరైదనది కాదంటూ అందులో ఆందోళన వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని నిలుపుదల చేయాలనే తన నిర్ణయాన్ని భారతదేశం ఏప్రిల్ 24న పాకిస్తాన్‌కు అధికారికంగా తెలియజేసిందని వర్గాలు తెలిపాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నందున తాము అగ్రిమెంటును పాటించాల్సిన అవసరం లేదని భారత వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ దెబశ్రీ ముఖర్జీ చెప్పారు. పాక్ నుంచి నీటి విషయంలో వరుస విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ ఇండియా మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించటం పాకిస్థాన్ ను ప్రమాదం అంచుకు నెట్టేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న నీటి సమస్యలు పాక్ ఆర్థిక పతనానికి దారితీస్తున్నాయి. 

వాస్తవానికి పాక్ ఆర్థిక వ్యవస్థలో జీడీపీ 25 శాతం సింధు జలాలపైనే ఆధారపటంతో ప్రస్తుతం పాక్ ఆందోళనలకు కారణంగా తెలుస్తోంది. ఇది పాక్ నేతలకు వాస్తవ నష్టాలపై ఆందోళనలు కలిగిస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో పాకిస్థాన్ లోపల అంతర్గత ప్రజా వ్యతిరేకత, తిరుగుబాటుకు దారితీస్తుందని తెలుస్తోంది. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ పశ్చిమ నదుల నుంచి వస్తున్న నీటిలో దాదాపు 80 శాతం పాకిస్థాన్ అవసరాలకు అందిస్తూ వస్తుంటే పాక్ మాత్రం దానికి బదులుగా ఇండియాలోకి ఉగ్రవాదులను పంపటంపై ప్రస్తుతం మోదీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.