. 2 minutes

ఆ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర
ఒప్పందాల ఉల్లంఘనే
కేంద్ర జలశక్తి, ఆర్థిక
మంత్రులకు లేఖలు రాశాం
ఎపికి అనుమతులు
రాకుండా కిషన్‌రెడ్డి, బండి
సంజయ్ అడ్డుకోవాలి
కృష్ణానది వాటాలో
బిఆర్‌ఎస్ వల్లే తీరని
అన్యాయం రాయలసీమ
ఎత్తిపోతల తెలంగాణకు
మరణశాసనం మీడియాతో
నీటిపారుదలశాఖ మంత్రి
ఉత్తమ్ చిట్‌చాట్

మన తెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటానికి తాను సిద్ధం ఉన్నానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గో దావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, దాని కి అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చే శారు. శుక్రవారం సచివాలయంలో మం త్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చే శారు. ఈ సందర్భంగా గోదావరి బనకచ ర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ అ భ్యంతరాలను వెల్లడిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌లకు ఈ ఏ డాది జనవరి 27వ తేదీన లేఖలు రాసిన ట్లు చెప్పా రు. బనకచర్ల ప్రాజెక్టు అంతరా ష్ట్ర ఒప్పందాల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఏపి పునర్విభజన చట్టానికి విరుద్దమనితెలిపారు.గోదావరి రివర్ మేనేజ్‌మెం ట్ బోర్డు(జిఆర్‌ఎంబి)కు, సెంట్రల్ వాటర్ కమిషన్ కు డిపిఆర్ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఏర్పాటైన పది సంవత్సరాల పా టు పరిపాలించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృ ష్ణా నదీ జలాల వాటా విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ జలాల వాటా 724 టిఎంసిలు కాగా, బిఆర్‌ఎస్ పాలన కాలంలో 1,254 టిఎంసిల నీటిని ఎంపి వినియోగించుకుందని గణాంకాలను మంత్రి వెల్లడించారు. నాడు ముఖ్యమంత్రి కెసిఆర్, నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావులు తెలంగాణకు 299 టిఎంసిలు, ఏపికి 512 టిఎంసిల నీటివాటాలను ఖరారుచేస్తూ ఒప్పందాలపై సంతకాలు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని వివరించారు.

ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను కెసిఆర్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనంగా మారిందని, ప్రతిరోజూ 3 టీఎంసీ తరలించేందుకు కెసిఆర్ ప్రభుత్వం ఆరోజు సహకరించిన మాట వాస్తవమని తెలిపారు. ఎపి సిఎం జగన్ విందులు, అలైబాలై చేసుకుని కృష్ణా, గోదావరి జలాల వినియోగం అంశాలపై చర్చించినట్లు ఆరోజు ప్రకటించారని, లోపాయకారికంగా నీటి దోపిడీకి కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ నీటి వాటాలను ఏపీ దోచుకునేందుకు సంపూర్ణంగా సహకరించారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేండ్ల కెసిఆర్ ప్రభుత్వ హయాంలోనే ముచ్చుమర్రి, మల్యాల లకు ఎక్కువగా నీటిని ఏపి ప్రభుత్వం తరలించుకు పోయిందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యేవరకు నాటి తెలంగాణ సిఎం కెసిఆర్ ఉద్దేశపూర్వకంగానే 2020 మే 5వ తేదీన జరగాల్సిని అపెక్స్ సమావేశానికి హాజరుకాలేదని, 2020 6వ తేదీన రెండో అపెక్స్ మీటింగ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రితో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారని తెలిపారు. జగన్, -కెసిఆర్ రహస్యం ఒప్పందంలో భాగంగానే తొలి అపెక్స్ సమావేశానికి కెసిఆర్ వాయిదా వేయించారని చెప్పారు.

బనకచర్లపై వారివి పచ్చి అబద్దాలు
ఏపి ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్‌ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.
కేంద్ర జలశక్తి పరిశీలిస్తామంది గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తన లేఖకు సమాధానంగా ప్రతిలేఖ రాసినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ అభ్యంతరాలను దృష్టిలో ఉంచకుని అన్ని నిబంధనలు పరిశీలిస్తామని పాటిల్ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు.
కేంద్ర మంత్రులు కేంద్రాన్ని ఒప్పించాలి
తెలంగాణకు అన్యాయాన్ని తలపెట్టే గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో అనుమతులు రాకుండా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి ఎంపీలు కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. బనకచర్లపై తాము కేంద్రానికి రాసిన లేఖలను ఇద్దరు కేంద్ర మంత్రులకు, బిజెపి ఎంపీలకు పంపిస్తానన్నారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.