
రాజస్థాన్లోని అల్వార్ జిల్లా నుంచి హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్వార్లోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఐసీయూ వార్డులో చేరిన మహిళపై అత్యాచారం జరిగింది. ఈ విషయంలో ఎంఐఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: AA22xA6 : అఫీషియల్ అనౌన్స్మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్లో దీపికా పదుకొనే..!
పోలీసుల నివేదికల ప్రకారం.. జూన్ 4న రాజస్థాన్లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బందికి చెందిన సభ్యుడు అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. జూన్ 2న తన మహిళను ట్యూబ్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధితో పోరాడి ప్రాణాలతో బయటపడిన మహిళ స్పృహలోకి వచ్చింది. దీంతో వార్డ్ సిబ్బంది ఆమె భర్తను పిలిపించారు. ఆ సమయంలో ఆమె మంచం చుట్టూ కర్టెన్లు వేసినట్లు కనిపించింది. దీంతో బాధితురాలు జరిగిన ఉదంతాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది. బాధితురాలి కథనం ప్రకారం.. నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ముందు మత్తుమందు ఇంజెక్ట్ చేశాడు. ఆమె అప్పటికే సగం స్పృహ కోల్పోయింది. నిందితుడు తనపై అత్యాచారం చేయబోతుండటం గమనించి ప్రతిఘటించింది.
READ MORE: KTR: ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది
చివరికి.. ఆమె మత్తులోకి జారుకుంది. మరునాడు ఉదయం జూన్(5)న మళ్లీ స్పృహలోకి వచ్చిన ఆమె కుటుంబీకులకు వివరించింది. ఐసీయూలో ఉన్న మరో మహిళా రోగి భర్త సిబ్బంది అత్యాచారం చేశాడని తెలిపారు. బాధితురాలి భర్త వైద్య కళాశాల పరిపాలనను సంప్రదించాడు. కానీ అధికారులు ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నర్సింగ్ సిబ్బంది సభ్యుడిని నేరస్థుడిగా నిర్ధారించారు.