మేడ్చల్: విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు ఐటి ఉద్యోగులు మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యత్నగర్ మండలం కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్పూర్కు చెందిన వర్షిత్, ప్రవీన్ యాదవ్, దినేశ్ అనే ఐటి ఉద్యోగులు మాధారం-ఎదులాబాద్ మార్గంలో కారు అతివేగంగా వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో భార్గవ్, వర్షిత్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మాధారంలోని ఓ గెస్ట్హౌస్లో పార్టీ చేసుకొని బయటకు వచ్చినట్టు సమాచారం. వీరు మద్యం మత్తులో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది.