
ఖమ్మం జిల్లా కల్లూరు మహిళా ఎస్ఐ హరితతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఎస్ఐ విధులకు ఆటంకం కల్గించినందుకు సీరియస్ అయిన పోలీస్ శాఖ నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్ కు తరలించింది. ఈ విషయాన్ని కల్లూరు డివిజన్ ఏసిపి రఘు చెప్పారు.
జూన్ 6న రాత్రి కల్లూరు పట్టణంలో తల్లాడ మండలానికి చెందిన రాయల రాము అనే ఓ పార్టీ లీడర్ కల్లూరు ఎన్ఎస్ పీ సెంటర్ లో ని ఓ హోటల్ కు వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఇరువర్గాల సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. హోటల్ నిర్వాహకుడి ఫిర్యాదుతో కల్లూరు ఎస్ఐ హరిత సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్ఐతో రాము వాగ్వాదానికి దిగి ఆమెపై చేయి చేసుకున్నాడు. వెంటనే పోలీసులు రాముతో పాటు తన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.