
అప్పుడప్పుడే పెళ్లి చేసుకుని కొత్త ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంటకు మృత్యువు ఆ ఆనందాన్ని ఎక్కువ రోజులు మిగల్చలేదు. హనీమూన్ వెళ్లాలనుకున్న వారి ప్రయాణానికి మొదట్లోనే రైలు రూపంలో బ్రేక్ వేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నవ వరుడు రైల్ కిందపడి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కొత్తపెళ్లి కూతురు గుండె పగిలేలా ఏడ్చే దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఉరకొండకు చెందిన 28 ఏళ్ల సాయికి ఈ మధ్యే పెళ్లి అయ్యింది. హనీమూన్ కోసం గోవాకు వెళ్లాలని ఆ దంపతులు అనుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వెకేషన్ కు వెళ్లాలని భావించారు.
ఈ క్రమంలో అందరూ కలిసి వాస్కోడగామా ఎక్స్ ప్రెస్ ఎక్కారు. రైలు ఇంకా కదలకపోవడంతో సాయి వాటర్ బాటిల్ తెచ్చేందుకు వెళ్లాడు. సాయి వెళ్లగానే రైలు కదలడం ప్రారంభమైయ్యింది. ఆ టైమ్ లో అతడి భార్య, బావ, బంధువులు రైల్లోనే ఉన్నారు. రైలు నెమ్మదిగా వేగం పుంజుకుంది. సాయి కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. కోచ్ పక్కనే పరిగెడుతూ జారిపడ్డాడు. రైలు, ఫ్లాట్ ఫారమ్ మధ్యలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు.
మృతుడు సాయి బయట ఉండడంతో ట్రెయిన్ లో ఉన్న ప్రెండ్స్ ట్రెయిన్ స్టాప్ చైన్ లాగారు. ట్రెయిన్ చైన్ లాగిన ప్రెండ్స్ ను ఆర్పీఎఫ్ పోలీసులు కిందకు దించి విచారించినట్లు సమాచారం. కానీ జీఆర్పీ సిఐ ఇందులో వాస్తం లేదని తెలిపారు. ప్రెండ్స్ చైన్ లాగడం తప్పే అని.. ఫైన్ కడుతామని అంటుండగానే మళ్ళీ ట్రెయిన్ కదిలింది.
తన భార్య.. బావమర్ధి ట్రెయిన్ లో ఉండడంతో సాయి కదులుతున్న ట్రెయిన్ ఎక్కబోయి మిస్ కావటంతో ప్లాట్ ఫాం మధ్య కింద పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. సాయిని వెంటనే ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో సాయి స్వగ్రామం ఉరవకొండలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. నవ వధువు ఫిర్యాదుతో కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు జీఆర్పీ పోలీసులు.