ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, ఎంటర్టైన్మెంట్ రంగంలో దిగ్గజ సంస్థ కళానిధి మారన్కు చెందిన సన్ పిక్చర్స్ కాంబోలో భారీ పాన్ ఇండియా ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రకటన నుంచే సినిమాపై ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి. దీన్ని నెక్స్ లెవెల్కు తీసుకెళ్లేలా బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపికా పదుకొనె కూడా ఈ టీమ్తో చేరడం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ బడ్జెట్ విజువల్ వండర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అద్భుతమైన తారాగణంతో ప్రభంజనం సృష్టించబోతోంది. ఈ భారీ కాంబోను తెలియజేసేలా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అభిమానులను, ప్రేక్షకులను మైమరపిస్తోంది. డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకొనె మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన ఈ వీడియో ఆమె శక్తివంతమైన పాత్రలోకి మారుతున్న విధానాన్ని చూపించిన తీరు అందరిలో ఉత్కంఠతను రేపుతోంది. హెడ్గేర్ను ధరించి ఆమె ఫుల్ కాస్ట్యూమ్స్తో సెట్లోకి అడుగు పెడుతూ యుద్ధానికి సిద్ధమైంది. మరోసారి క్వీన్ విజయం సాధించనుందనేది దీంతో స్పష్టమవుతోంది.
ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ‘ఎఎ22 x ఎ6’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, రొమాలు నిక్కబొడిచే యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్, మన సంస్కృతికి అద్ధం పట్టే కథ, గ్లోబల్ లుక్తో ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుంది. ఈ సంవత్సరం చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ “జవాన్ సినిమాలో దీపికతో కలిసి పని చేశాను. అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకు సంబంధించిన పరిధి, శక్తి, ప్రతి ఫ్రేమ్లో ఆమె అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన గ్రేస్ గొప్పగా ఉంటాయి. ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకంగా ఉండి ముందుకు నడిపించిందో మనకు తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్తో పాటు దీపికా పదుకొనెతో కలిసి సినిమా చేయటం అనేది దర్శకుడి కల నేరవేరినట్టయ్యింది. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇందులో సృష్టించబోతున్నాం”అని అన్నారు.