. < 1 minute
Aadi Saikumar Teaser Of Aadi Saikumars Horror Thriller Shambala Released

డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. అతని ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం ఆడియెన్స్‌ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే ‘శంబాలా’ సినిమా చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న దర్శకనిర్మాతలు.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా టీజర్ వదిలారు.

Also Read : Prabhas : ‘కల్కి 2’ అభిమానులకు శుభవార్త చెప్పిన నిర్మాత..!

విరుపాక్ష, ఓదెల 2,పొలిమేర, పొలిమేర 2.. వంటి బ్లాక్ మ్యాజిక్ సినిమాలు ప్రేక్షకులను నుంచి ఎలాంటి ఆదరణ పొందాయి మనం చూశాం. కాగా ఈ ‘శంబాలా’ అంతకు మించి అనేలా ఉంది. టీజర్ లో ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా టీజర్ ను హైలెట్‌గా కట్ చేశారు. ఒక్కోక సీన్ ఎంతో ఇంట్రెస్ట్‌గా క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇక ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై, ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సూపర్ థ్రిల్లర్‌ను యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారట. మొత్తానికి యంగ్ హీరో సాయి కుమార్ ఈ మూవీతో బారీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.