
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదులాబాద్ లో అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ లు కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాద ధాటికి తీవ్రంగా గాయపడ్డ భార్గవ్ యాదవ్, వర్షిత్ అక్కడికక్కడే మృతి చెందారు. దినేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. నలుగురిని సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.
Also Read:CM Yogi: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి.. ముస్లిం సోదరులకు కీలక సందేశం..!
ఎదులాబాద్ నుంచి కుంట్లూరు వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. నలుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దగ్గర్లో ఉన్న రిసార్ట్ కి వెళ్ళారా.. లేక ఎక్కడైనా పార్టీకి అటెండ్ అయి వస్తున్నారా అనేది గుర్తిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.