
మెదక్ జిల్లా అల్లాదుర్గం బుడగ జంగాల కాలనిలో విషాదం చోటుచేసుకుంది. జ్వరం, దగ్గు సిరప్ చిన్నారి ప్రాణాలు తీసింది. జ్వరం, దగ్గు సిరప్ తాగి ఐదేళ్ల చిన్నారి ప్రియ(05) మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు సాయమ్మ, సిద్ధయ్యలకు ఐదుగురు సంతానం. నెల రోజుల క్రితం అల్లాదుర్గం పీహెచ్ సీ నుంచి జ్వరం, దగ్గు సిరప్ లను తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నిన్న చిన్నారులకు జలుబు, జ్వరం రావడంతో ఐదుగురు పిల్లకు సిరప్ తాగించారు తల్లిదండ్రులు.
Also Read:KTR: ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది
సిరప్ తాగించిన కాసేపటికే చిన్నారి ప్రియ(05) మృతి చెందగా.. మరో చిన్నారి ఐశ్వర్య (06) తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే జోగిపేట ప్రభుత్వాసుపత్రికి చిన్నారులను తరలించారు. దగ్గు మందు తాగిన తర్వాత రేణుక(09), శ్రీను(08), గణేష్(03) నార్మల్ గానే ఉన్నారు. సిరప్ బాటిల్స్ కూడా ఇంకా గడువు ముగియలేదు. చిన్నారి మృతికి అధిక డోస్ కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.