. < 1 minute
Andhra Pradesh: నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!

వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్‌ ఆర్ధిక ప్రణాళికలు రచిస్తోంది. అందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తిచేసిన నీతి ఆయోగ్‌ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8 జిల్లాలతో పాటు విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంతేకాదు విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఇటు 20 లక్షల మందికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్పించేలా ముందుకెళ్లాలన్నారు చంద్రబాబు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, మన్యం సహా ఎనిమిది జిల్లాల్లో ఆర్ధిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. పలు ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలను గుర్తించాలన్నారు. ఇటు మూలపేట నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్య బీచ్ రోడ్లును అభివృద్ధి చేసి.. జాతీయ రహదారికి అనుసంధానం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా.. 6 పోర్టులు, 17 వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్‌ను డెవలప్‌ చేయాలని నిర్దేశించారు. వచ్చే 7ఏళ్లలో ఐటీ రంగంలో కనీసం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా ముందుకెళ్తామన్నారు.

ఇది కూడా చదవండి: Musk’s Starlink: భారత్‌లో స్టార్ లింక్‌ సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌.. కేంద్రం ఆమోదం!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.