. < 1 minute

500 Note Ban

న్యూఢిల్లీ: 2016లో జరిగిన డీమానిటైజేషన్‌తో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. గంటల తరబడి బ్యాంకుల ఎదుట లైన్‌లో నిలబడటం.. పెద్ద నోట్లకు చిల్లర దొరకకపోవడం వంటి కష్టాలు పడ్డారు. నెమ్మదిగా ఆ సమస్యలను అధిగమించారు. అయితే ఇప్పుడు మరోసారి నోట్ల రద్దు తెరమీదకు వచ్చింది. రూ.500 నోట్లను(500 Note Ban) కేంద్రం రద్దు చేస్తుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2026 మార్చి నుంచి రూ.500 నోట్లను (500 Note Ban) దశలవారీగా రద్దు చేస్తారంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో వీడియోలు చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి ప్రకటన చేయలేదని.. ప్రజలు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ సూచించింది. ఇటువంటి వార్తలను సోషల్‌మీడియాలో షేర్ చేసే ముందు అధికారిక సోర్స్‌లను ఎప్పటికప్పుడు సందర్శించి నిర్ధారించుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.