
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తాజా చిత్రం సితారే జమీన్ పర్ ప్రీమియర్ సందర్భంగా జరిగిన వేడుకలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తన భార్య అంజలితో కలిసి ఆవిష్కరణ వేదికకు చేరుకున్న టెండూల్కర్ను చూసి, అక్కడ ఉన్న అతిథులు “సచిన్, సచిన్” అనే నినాదాలతో గది మొత్తం హోరెత్తించారు. ఈ ఘట్టం అభిమానుల మదిలో క్రికెట్ మేజిక్ను మరలా తెచ్చింది. టెండూల్కర్కు తన ట్రేడ్మార్క్ చిరునవ్వుతో అందరినీ పలకరించడమూ, చేతులు జోడించి హృదయపూర్వకంగా అభినందించడమూ పార్టీకి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి.
సచిన్ టెండూల్కర్, ఆమిర్ ఖాన్ల మధ్య నాటి నుంచి ఉన్న స్నేహబంధం తెలిసిందే. ఇద్దరూ తమ తమ రంగాలలో గౌరవనీయ వ్యక్తులు కావడంతో, ముఖ్యమైన సందర్భాలలో పరస్పరం మద్దతు తెలుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా ఆమిర్ తన కుమారుడు జునైద్ ఖాన్ నటించిన “లవ్యాపా” అనే ప్రత్యేక ప్రదర్శనకు సచిన్ను ఆహ్వానించాడు. తాజాగా జరిగిన హౌస్ పార్టీకి సచిన్ భార్యతో కలిసి హాజరై మిగతా అతిథులతో కలిసి ఆ సంబరాన్ని భాగస్వామ్యం చేసాడు. ఆమిర్ ఖాన్ తన ఇంట్లో నిర్వహించిన ఈ గ్రాండ్ పార్టీకి అనేక మంది ప్రముఖులతో పాటు ప్రత్యేక అవసరాల గల చిన్నారులను కూడా ఆహ్వానించడం విశేషం. తమ హీరో సచిన్ను నేరుగా చూసిన ఆ పిల్లలు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ఇక క్రికెట్ లో కూడా సచిన్ టెండూల్కర్ను గౌరవిస్తూ, భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐకానిక్ టెస్ట్ సిరీస్ పేరు మార్పు జరిగింది. ఇప్పటివరకు పటౌడీ ట్రోఫీ పేరుతో జరగిన ఈ సిరీస్ ఇక నుంచి టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా పిలవబడనుంది. ఇది భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ ల గౌరవార్థంగా నిర్ణయించబడింది. టెస్టుల్లో అత్యధికంగా 15,921 పరుగులు చేసిన సచిన్, 704 వికెట్లతో ఆండర్సన్ ఇద్దరూ తమదైన ముద్రవేసిన దిగ్గజులు. గతంలో 14 టెస్టుల్లో తొమ్మిది సార్లు టెండూల్కర్ను అవుట్ చేసిన ఆండర్సన్తో సచిన్ పోటీ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ప్రత్యేక ట్రోఫీ కోసం టెస్ట్ సిరీస్ 2025 జూన్ 20న హెడింగ్లీ వేదికగా ప్రారంభం కానుంది.
This is so heartful…
https://t.co/o2JNf1qRjI
— Biswajit
![]()
![]()
![]()
(@biswa_1211) June 7, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..