. < 1 minute

మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్..రాహుల్ సంచలన ఆరోపణలు

Caption of Image.

కాంగ్రెస్ అగ్రనేత,లోక్ సభాపక్ష నేత రాహుల్ గాంధీ సంచనల ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్  జరిగిందని వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ ఏడాది చివర్లో జరిగే  బిహార్ లో కూడా ఇలాంటి కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడే  మహారాష్ట్రలో  విజయం సాధించిందని చెప్పారు. బీజేపీ ఎక్కడ ఓడిపోతే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతుందని ఆరోపించారు.  బీజేపీ ఎన్నికల రిగ్గింగ్ కు ఎలా పాల్పడుతోంది రాహుల్ గాంధీ తన ఎక్స్ లో   వివరించారు.

ఐదు దశల్లో 

  • ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌ను తారుమారు చేయడం
  • ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం
  • ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం
  •  బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం
  •  చివరగా సాక్ష్యాలను దాచిపెట్టడం

ఈ ఐదు పద్ధతుల ద్వారానే 2024లో జరిగిన ఎన్నికల్లో  బీజేపీ  గెలిచిందన్నారు.  2023లో కేంద్రంలోని ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని కూడా రాహుల్ తప్పుబట్టారు. 

మహారాష్ట్రలో   2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మహాయుతి కూటమి 288 స్థానాలకు 235 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో బీజేపీ 132 సీట్లు గెలిచింది.  కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే,శరద్ పవార్ (మహావికాస్ అఘాడీ) కూటమి కేవలం 50 సీట్లకే పరిమితమైంది. 

►ALSO READ | Karnataka Dalit attacks: కర్ణాటకలో పడగ విప్పిన కులవివక్ష..ముగ్గురు దళిత మైనర్లను స్తంభానికి కట్టేసి కొట్టారు

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.