
టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహానికి కళ్లెం పడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం గురించి మస్క్ ఓ ప్రకటన చేశారు. వాస్తవానికి.. ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోల్ నిర్వహించారు. అందులో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా వద్దా అని అడిగారు. తాజాగా ఈ పోల్ ఫలితాలను మస్క్ వెల్లడించారు. 80% మంది ప్రజలు మద్దతుగా ఓటు వేశారని ట్రంప్ పేర్కొన్నారు.
READ MORE: CM Chandrababu: జలవనరుల శాఖపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు..
“అమెరికాలో 80% మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం! సరిగ్గా 80% మంది దీనితో ఏకీభవిస్తున్నారు.” అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్లో ‘ది అమెరికా పార్టీ’ అని టైటిల్ పెట్టారు. సోషల్ మీడియాలో మస్క్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో మస్ ఈ చర్చ తీసుకురావడం సంచలనంగా మారింది.
READ MORE: CM Yogi: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి.. ముస్లిం సోదరులకు కీలక సందేశం..!
మరోవైపు..శత్రువును డొనాల్డ్ ట్రంప్ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. తన దారికి రాని వారిపై సామ, దాన, దండోపాయాలు ప్రయోగించడానికీ వెనుకాడరు. తన ఆదేశాలను పాటించని అమెరికా విశ్వవిద్యాలయాలపై ఇప్పటికే కొరడా ఝళిపిస్తున్నారు. సుంకాల విషయంలోనూ రాజీపడటం లేదు ఈ నేపథ్యంలో నిన్నటివరకు మిత్రుడిగా ఉండి అకస్మాత్తుగా శత్రువుగా మారిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విషయంలో ఇందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తారని భావించలేం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిపై మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ట్రంప్ను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. అంతటితో ఆగలేదు. తాను సాయం చేయకపోతే అమెరికా పీఠంపై ట్రంప్ కూర్చునేవారే కాదని పేర్కొన్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లి తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందన్న సంకేతాలనూ పంపారు. ట్రంప్పై అభిశంసనను తాను సమర్థిస్తానని వ్యాఖ్యానించారు. ఈ స్థాయిలో మస్క్ దాడి చేసిన తర్వాత ట్రంప్ మౌనంగా ఉండే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.
The America Party https://t.co/hO5S8Kjb5O
— Elon Musk (@elonmusk) June 6, 2025