. < 1 minute

ఢాకా: బంగ్లాదేశ్ ఎన్నికలపై ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు.  2026 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆయన శుక్రవారం ప్రకటించారు. గత సంవత్సరం ప్రజా తిరుగుబాటు కారణంగా ప్రభుత్వం కూలిపోయింది. అంతేకాదు, షేక్ హసీనా దేశం విడిచి పారిపోయింది. హసీనా లేకుండానే బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే.

ముహమ్మద్ యూనస్ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. “2026 ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజైనా ఎన్నికలు జరుగుతాయని.. నేను దేశ పౌరులకు తెలియజేస్తున్నాను” అని అన్నారు. విస్తృత నిరసనలు, రాజకీయ తిరుగుబాటు ఆగస్టులో షేక్ హసీనా రాజీనామాకు దారితీసింది. ఇదిలావుంటే.. డిసెంబర్ 2025 నాటికి జాతీయ ఎన్నికలు నిర్వహించాలని, “వివాదాస్పద సలహాదారులను” తొలగించడం ద్వారా తన మంత్రివర్గాన్ని పునర్నిర్మించాలని గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా తెలిపింది.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.