
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా, పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుందని టాక్. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయినట్లు సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెని ఫిక్స్ చేశాడు. కానీ ఊహించని విధంగా దీపికను ఈ సినిమా నుంచి తప్పించాడు సందీప్. దీపికా కండీషన్స్ నచ్చకే సందీప్ ఆమెను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. దీపికా ప్లేస్ లో ఇప్పుడు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రిను సెలక్ట్ చేశారు. అయితే దీపికా పదుకొనె ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
దీపికా రోజుకు కేవలం 6 గంటలు మాత్రమే షూటింగ్కు అందుబాటులో ఉంటానని, 100 రోజులకు మించి షూటింగ్ జరిగితే అదనపు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగు డైలాగులు చెప్పడానికి ఇష్టపడలేదని, లాభాల్లో షేర్ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే 35 రోజుల షూటింగ్ కు దీపికా ఏకంగా రూ. 25 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తుంది. రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 10శాతం వాటా కూడా అడిగిందని తెలుస్తుంది. దాంతో ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి