
రామచంద్రాపురం, వెలుగు: భారతీనగర్ డివిజన్లోని సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని జోనల్ కమిషనర్ హేమంత్ హామీ ఇచ్చారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ సింధూ ఆదర్శ్రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ఐజీ మెయిన్ రోడ్డు నుంచి మ్యాక్ సొసైటీ కాలనీ వరకు కొత్త రోడ్డు, సొసైటీ కమ్యూనిటీ హాల్ ఇతర పనులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
బీహెచ్ఈఎల్ రోడ్డుకు ఇరువైపులా చెత్తా చెదారం పేరుకుపోయి ఉందని శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లు కూడా ఫలితం లేనందున భెల్ యాజమాన్యంతో మాట్లాడి చైన్ లింక్ మెష్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో ఇళ్లపై వేలాడుతున్న కరెంటు వైర్ల గురించి కార్పొరేటర్ సింధు జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా నూతన స్తంభాలను వేయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
బీడీఎల్, ఎంఐజీ కాలనీలలో ఓపెన్ జిమ్లు, బ్రాంచ్ ఫ్రూనింగ్ వెహికల్స్ కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ సురేశ్, ఎస్ఈ శంకర్, డీఈ దేవేందర్, ఏఈ ఫైజల్, మెడికల్ఆఫీసర్ విజయ రామారావు, కాలనీ వెల్ఫేర్ సభ్యులు పాల్గొన్నారు.