
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు : కాంగ్రెస్మాట తప్పదు, మడమ తిప్పదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామన్నారు.
కామారెడ్డి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3,028 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిందన్నారు. కేవలం కుటుంబ అభివృద్ధి మాత్రమే జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం పని చేస్తుందన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, పార్టీ మండల ప్రెసిడెంట్ భీమ్రెడ్డి, నాయకులు ఇంద్రాకరణ్రెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.