. < 1 minute
Green Energy Production Needs To Increase In The Future Dy Cm Bhatti

Dy CM Bhatti: తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఏపీలోని కర్నూలులో గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ చూశాను అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ వినియోగం పెరిగింది.. థర్మల్ విద్యుత్ ఖర్చు, కాలుష్యం కూడా పెరిగింది.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. సోలార్, విండ్, మౌంటెడ్ సోలార్, పంప్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.. 2025 న్యూ ఎంఎర్జీ పాలసీ తెచ్చాం.. సింగరేణిలో బొగ్గు ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్ తెలంగాణలో ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

Read Also: Chhattisgarh: బీజాపూర్ భీకర ఎన్‌కౌంటర్‌.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..

ఇక, గ్రీన్ కో యాజమాన్యం ప్లాంట్ చూడమని ఆహ్వానించింది అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. లక్ష కోట్ల పెట్టుబడికి తెలంగాణలో వివిధ సంస్థలతో ఎంఓయూలు జరిగాయి.. కర్నూలు వద్ద గ్రీన్ కో అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నాంది పలికింది.. సోలార్ పవర్ సూర్యాస్తమయం తరువాత ఉత్పత్తికి అవకాశం లేదన్నారు. ఉదయం ఉత్పత్తి అయ్యే సోలార్ పవర్ తో వాటర్ పంప్ చేసి రాత్రి అదే నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.. 1680 మెగావ్వాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.. గ్రీన్ కో కంపెనీని అభినందిస్తున్నా.. ఇలా చేయడం ప్రపంచంలో మొదటిదని చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులు ముందుకొచ్చి జాతికి ఉపయోగపడే ప్రక్రియ చేపట్టాలి అని పిలుపునిచ్చారు. గ్రీన్ కో సంస్థ భారత జాతికి విద్యుత్ అందిస్తుంది.. జీడీపీ పెరిగి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.