. < 1 minute
Salt Powered Scooters: ఉప్పుతో నడిచే స్కూటర్లు వచ్చేశాయి.. ధర తక్కువ మన్నిక ఎక్కువ.. మన దేశంలో ఎప్పుడంటే..

ఇప్పటివరకు మీరు రోడ్లపై పెట్రోల్, డీజిల్, లిథియం బ్యాటరీలతో నడిచే స్కూటర్లను చూసి ఉంటారు. అయితే త్వరలో కొత్త యుగం రాబోతోంది. అవును త్వరలో ఉప్పుతో నడిచే స్కూటర్లను చూడనున్నారు. ఇప్పటికే చైనాలో, సముద్రపు ఉప్పుతో తయారు చేసిన సోడియం-అయాన్ బ్యాటరీలతో నడిచే స్కూటర్లు ఇప్పుడు రోడ్లపైకి వచ్చేశాయి. ఈ రోజు ఈ స్కూటర్లు ఎలా పని చేస్తాయి? అవి భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయో పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం..

ఈ సాల్ట్ బ్యాటరీ ఎలా పనిచేస్తుంది?

చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికీ లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నాయి. ఇవి ఖరీదైనవి, ఛార్జింగ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటాయి. అయితే ఈ కొత్త టెక్నాలజీలో..సోడియం (ఉప్పు)తో తయారు చేసిన బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇవి చౌకగా ఉండటమే కాదు త్వరగా ఛార్జ్ అవుతాయి కూడా.. ఈ సాల్ట్ బ్యాటరీలను కేవలం 15 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని చెబుతున్నారు. అంతేకాదు ఈ బ్యాటరీల ధర లిథియం బ్యాటరీ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది పర్యావరణానికి సురక్షితమైన ఎంపిక కూడా.

సాల్ట్ బ్యాటరీ స్కూటర్ల ధర ఎంత అంటే

ఈ స్కుటర్ల ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఈ స్కూటర్లు చైనాలో మన దేశ కరెన్సీలో రూ. 35,000 నుంచి 51,000 మధ్య లభిస్తున్నాయి. అంటే ఇవి పెట్రోల్ లేదా ఖరీదైన EV స్కూటర్ల కంటే చాలా చౌకగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

ఈ టెక్నాలజీ గేమ్ ఛేంజర్‌గా ఎందుకు మారింది?

లిథియం కొరత, ఖరీదైన మైనింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. లిథియంను అధికంగా వాడటం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అంతేకాదు లిథియంతో పోల్చితే సోడియం సులభంగా లభిస్తుంది, ఇది మహాసముద్రాలలో సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల ఈ బ్యాటరీలు చౌకగా, మన్నికైనవి , పర్యావరణ అనుకూలమైనవిగా ఉన్నాయి.

ఈ స్కూటర్లు భారతదేశానికి ఎప్పుడు వస్తాయి?

భారతదేశంలో ఇప్పటికే ఈ సాల్ట్ బ్యాటరీ స్కూటర్ల తయారీపై పలు కంపెనీలు అంటే ఓలా, అథర్, హీరో ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు ఈ దిశలో తయారీపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వం కూడా స్థిరమైన బ్యాటరీ సాంకేతికతపై దృష్టి సారిస్తోంది. మన దేశంలో ఈ స్టాట్ బ్యాటరీ ఇంకా పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ.. రాబోయే కొన్ని సంవత్సరాలలో “ఉప్పుతో నడిచే స్కూటర్” భారతదేశ రోడ్లపై కూడా నడుస్తుందని భావిస్తున్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.