ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే లండన్ చేరిపోయింది. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్ట్ సిరీస్ కోసం శుభ్మాన్ గిల్ కెప్టెన్గా 18 సభ్యులతో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు లేకుండానే ఈ యువ జట్టు రంగంలోకి దిగుతోంది. దీంతో తుది జట్టులో ఎవరు సెలక్ట్ అవుతారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఓపెనింగ్ జంటగా కెఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింట్ టీం ఇండియా మేనేజ్మెంట్కు ఓ సలహా ఇచ్చారు.
కెఎల్ రాహుల్కి బదులుగా సాయి సుదర్శన్ని ఓపెనర్గా ఆడించాలని ఆయన సూచించారు. సాయి సుదర్శన్ క్లాస్, టెక్నికల్ ప్లేయర్ అని.. యశస్వీతో కలిసి ఓపెనింగ్ చేస్తాడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సుదర్శన్ టెస్టుల్లో భాగా రాణిస్తాడని.. ఓపెనర్లుగా ఇద్దరు యువ ఆటగాళ్లు ఉంటే.. మూడో స్థానంలో అనుభవం ఉన్న రాహుల్ లేదా కరుణ్ నాయర్ని ఆడించవచ్చని అన్నారు. దీంతో యువ కెప్టెన్ శుభ్మాన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కి రావొచ్చని స్పష్టం చేశారు. ఇంగ్లండ్ సిరీస్లో టీం ఇండియా టాప్-5 బ్యాటర్లుగా సుదర్శన్, జైస్వాల్, రాహుల్, గిల్, కరుణ్ నాయర్ ఉండొచ్చని పాంటిగ్ పేర్కొన్నారు.