. < 1 minute

బీజాపూర్ జిల్లాలో ఎన్​కౌంటర్ .. ఐదుగురు మావోయిస్టులు మృతి

Caption of Image.
  • బీజాపూర్  జిల్లాలో ఎన్​కౌంటర్​ .. ఐదుగురు మావోయిస్టులు మృతి    చనిపోయిన వాళ్లలో 
  • ఇద్దరు మహిళలు.. వారిని గుర్తించాల్సి ఉందన్న ఎస్పీ
  • పది మందిని అదుపులోకి తీసుకున్నారని పౌర హక్కుల సంఘం ఆరోపణ
  • వాళ్లను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ 

భద్రాచలం, వెలుగు:  చత్తీస్​గఢ్​ రాష్ట్రం ఇంద్రావతి నది నేషనల్​ పార్కు ఏరియాలో శనివారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు ఎవరనేది గుర్తించాల్సి ఉందని బీజాపూర్​ ఎస్పీ జితేంద్రకుమార్ తెలిపారు.  నేషనల్​ పార్కు ఏరియాలో గత మూడు రోజులుగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నెల 5న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్​ మృతి చెందగా 6వ తేదీన మైలారపు అడెల్లు అలియాస్​ భాస్కర్​చనిపోయారు. తాజాగా శనివారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆటోమెటిక్​ గన్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్​ పార్కు ఏరియాలో80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి పోలీస్​స్టేషన్, బేస్​క్యాంపులు లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు సేఫ్​ జోన్​గా ఎంచుకుని తలదాచుకున్నట్టు తెలుస్తున్నది. ఇది పసిగట్టిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్​పీఎఫ్ కోబ్రా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్​ చేపట్టాయి.  

అడవిలో జవాన్ల కష్టాలు 

ఈ నెల 4న డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్​పీఎఫ్  కోబ్రా బలగాలు ఇంద్రావతి నది నేషనల్​ పార్కు ఏరియా అడవుల్లోకి ప్రవేశించాయి. మూడు రోజులుగా అడవిలోనే సెర్చింగ్ కొనసాగుతుండడంతో  విపరీతమైన ఎండలకు జవాన్లు డీహైడ్రేషన్​కు గురవుతున్నారు. ఒక జవాన్​ను పాము కరిచినట్టు తెలిసింది. మరి కొందరు జవాన్లపై తేనె టీగలు దాడి చేశాయి. దీనితో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. సుమారు ఏడుగురు జవాన్లు అస్వస్థతకు గురికావడంతో వారిని హెలికాప్టర్​తో తరలించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.