. < 1 minute

మన తెలంగాణ/భూపాలపల్లి జిల్లా ప్రతినిధి/మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం, అంబటిపల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ ఎగువభాగాన గోదావరి నదిలో శనివారం ఈతకు వెళ్లిన ఆరుగురు యువకులు ప్రమావదశాత్తు గల్లంతయ్యారు. మహదేవపూర్ మండలం, అంబటిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పత్తి మధుసూదన్ (18), పత్తి శివ మనోజ్ (15), మ రో ఇద్దరు తొగరి రక్షిత్ (13), కర్నాల సాగర్ (16), మహాముత్తారం మండలం, కొర్ల కుంట గ్రామానికి చెందిన బొల్లెడ రామ్‌చరణ్ ఆలియాస్ పండు (18)
ఖమ్మంపల్లి పిపి చెందిన రాహుల్ (19) గల్లంతైన వారిలో ఉన్నారు. సమాచారం అందుకున్న మహదేవపూర్ ఎస్‌ఐ పవన్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అంబటిపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం బంధువుల వివాహ వేడుకలకు వచ్చి,

శనివారం సమీపంలో ఉన్న గోదావరి నది, మేడిగడ్డ బ్యారేజీకి 20 మీటర్ల దూరం ఎగువభాగానికి స్నానం కోసం వారంతా వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం ఏడుగురు యువకులు వెళ్లగా ఆరుగురు గల్లంతు కాగా ఒకరు నదిఒడ్డున ఉండి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆరుగురు నదిలో మునిగిపోవడాన్ని ఒడ్డున ఉన్న యువకుడు ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపాడు. పోలీసులు భూపాలపల్లి సింగరేణి రెస్కూటీంను రప్పించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆరుగురు యువకులు గల్లంతు కావడంతో మహదేవపూర్, మహాముత్తారం మండలాలల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. గల్లంతైన వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.