. 2 minutes

నిధుల సమీకరణకు ఖాళీ స్థలాలు,
ప్లాట్ల బహిరంగ వేలానికి సర్వం
సిద్ధం 20వ తేదీ నాటికి
నోటిఫికేషన్ నాలుగు ప్రాంతాల్లోని
ప్లాట్లు, స్థలాలు విక్రయించేందుకు
హౌసింగ్‌బోర్డు, రాజీవ్ సృగృహ
సంస్థల ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థ లాలు, ఫ్లాట్లను బహిరంగ వేలం వేయాలని హౌ సింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ సంస్థలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శా ఖ కార్యదర్శి డా.జ్యోతిబుద్ద ప్రకాశ్, హౌసింగ్ బోర్డు కమిషనర్ వి.పి.గౌతం లు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు వనరుల సమీకరణలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిం ది. ఈ నెల 20వ నాటికి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు కమిషనర్ వి.పి.గౌతం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాలలోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి అయిన, పాక్షికంగా పూర్తి అయిన అపార్ట్ మెంట్లు- ఫ్లాట్లతో పాటు, ఓ పెన్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని నాలుగు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాల ను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు.

ఎటువంటి వివాదాలు లేని భూములు, అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్మెంట్లు-ఫ్లాట్లను కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌతంవిజ్ఞప్తి చేశారు. ఈ విక్రయాలతో వచ్చిన ఆదాయంతో, ఒఆర్‌ఆర్ పరిసరాల్లోనూ, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ పథకాలను చే పట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. వీటిని బహిరం గ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గాజుల రామారం, పోచా రం, ఖమ్మం పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో ఒక్కో దానిలో సుమారు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లు ఉన్న టవర్‌ను యూనిట్‌గా ఏక మొత్తంగా విక్రయించనున్నారు. బిల్డర్లు, ఒక గ్రూప్ గా ఏర్పడి కొనుగోలు చేయాలనుకున్న వారితో పాటు, హౌసింగ్ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, బహుళ అంతస్తుల భవనాల అవసరం ఉన్న సంస్థలు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వేలం వేసే వాటి వివరాలు..
రాజీవ్ స్వగృహకు చెందిన వాటి వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్ గూడలో 20, చందానగర్ లోని 3 ఒపెన్ ఫ్లాట్లు , బండ్లగూడలో 159 పూర్తి అయిన ఫ్లాట్లు, మేడ్చల్- మల్కాజ్ గిరి గాజులరామారంలోని 5 టవర్లలోని పూర్తి కాని కట్టడాలు, పోచారంలోని పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ రకాల ఫ్లాట్లు, బహదూర్‌పల్లిలోని 69 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని పోతులమడుగులో111, అమిస్తపూర్‌లోని 45 ఓపెన్ ప్లాట్లను విక్రయించడానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు. ఖమ్మం జిల్లాలో పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతో పాటు, 3.38ఎకరాల ఖాళీ స్థలాన్ని కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నామని తెలిపారు. కాగా హౌసింగ్ బోర్డు స్థలాల వివరాలు ఇలా ఉన్నాయి.

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కెపిహెచ్ బి)- 4వ ఫేజ్ లో ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల 33 గుంటల విస్తీర్ణంలో ఖాళీ భూములను, అదే కాలనీలో ఉన్న రెండు ఓపెన్ ప్లాట్లును (4598 చదరపు గజాల విస్తీర్ణం, 2420 చదరపు గజాల స్తీర్ణం) ఈ- వేలం ద్వారా విక్రయింస్తున్నట్లు తెలిపారు. అలాగే నాంపల్లి లోని 1148 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఖాళీ స్థలాన్ని, సంజీవరెడ్డి నగర్ లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీహాల్‌కు చెందిన 2605 చదరపు గజాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సంజీవరెడ్డి నగర్‌లోని కమ్యూనిటీహాల్ (సెల్లార్, స్టిల్ట్, జి+1) 22,285 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 37,070 చదరపు అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తి అయ్యే స్థితిలో ఉన్నదని, ఈ భూములను ఫంక్షన్ హాల్ నిర్వహణ కోసమే వేలం వేయనున్నట్లు స్పష్టం చేశారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.