
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. జూన్ 5న గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ జూన్ 8న ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు.
మాగంటి గోపినాథ్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఐఏజీ ఆస్పత్రిలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేపించుకున్నారు. మళ్లీ గుండెపోటు రావడంతో జూన్ 5న కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడు రోజులుగా వెంటిలెటర్ పైనే మాగంటికి చికిత్స అందించారు డాక్టర్లు. ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
గోపి నాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు,పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో టీడీపీ నుంచి,2018,2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
మాగంటి గోపీనాథ్ 1983లో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత ముందస్తు ఎన్నికల్లో 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విష్ణువర్థన్ రెడ్డిపై గెలిచాడు.2023లోనూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పై విజయం సాదించాడు.