. < 1 minute

ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం..

Caption of Image.

మాగంటి  గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదర్ గూడలో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియు యూనివర్శిటీలో బీఏ పూర్తి చేశాడు. మాగంటికి ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మాగంటి గోపీనాథ్ 1983లో  టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు. 

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత ముందస్తు ఎన్నికల్లో 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విష్ణువర్థన్ రెడ్డిపై గెలిచాడు.2023లోనూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి  అజారుద్దీన్ పై విజయం సాదించాడు. 

జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ జూన్ 8న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ,గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్,కేసీఆర్, కిషన్ రెడ్డి, హరీశ్,కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.