
టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న అతి భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రం ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ చిత్రాలు డైరెక్ట్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా,ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా తేపకో అప్డేట్ అందుతూనే ఉంది. ప్రస్తుతం ఓ యాక్షన్ సీన్ కోసం ప్రత్యేక సెట్ను వేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Pooja Hegde : నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది..
ఈ సెట్లో ఎన్టీఆర్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు సినిమా మొత్తానికి ఈ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్, మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట. ఇక పోతే ఈ మూవీలో హీరోయిన్ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుండగా తాజాగా కిక్కిచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.. ఈ మూవీలో ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రిని తీసుకున్నారట. కానీ దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్రిప్తి లీడ్ హీరోయిన్ కాదని, సెకండ్ హీరోయిన్ అని పోస్టులు చేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.