. < 1 minute

ఆధ్యాత్మికం: మృగశిర కార్తె… వర్షాకాలం.. బెల్లం.. ఇంగువ తినండి..

Caption of Image.

ఈ ఏడాది ( 2025) రోహిణి కార్తె కూల్​ కూల్​ గా ముగిసింది.  రోళ్లు పగిలేలా ఎండలు కాయాల్సిన రోజులు చల్లని వాతావరణంతో రోహిణి కార్తె కంప్లీట్​ అయి.. విశ్వావశునామ సంవత్సరంలో మృగశిర కార్తెలోకి జూన్​ 8 ఆదివారం ఎంటరయ్యాం. మృగశిర కార్తెకు హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.  పురాణాల ప్రకారం మృగశిర కార్తెకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. .

మృగశిర కార్తెలో వర్షాలు పడతాయి.  అంటు వ్యాధులు ప్రబలుతాయి.  వాతవరణం చల్లబడటంతో కొన్ని రకాల వ్యాధులు వస్తాయి.  అలాంటి వాటినుంచి రక్షణ పొందేందుకు ఇంగువ .. బెల్లం కలిపి తింటే వేడి పెరిగి వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. 

భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది.   రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి … మృగశిర కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు. 

ఎలా ప్రారంభమవుతుంది..?

సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు.  ఏ నక్షత్రం సమీపంలో ఉంటే.. ఆ కార్తెకు ఆ పేరు పెడతారు… అశ్వినితో ప్రారంభమై రేవతీతో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో సూర్యుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. మృగశిర కార్తె లో  దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర , మృగం , మిరుగు , మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. .

పురాణాల్లో ఏముందంటే..!

వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తును బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది.   ఈ కార్తె ప్రాధాన్యత మనకు భగవద్గీతలోనూ కనిపిస్తుంది.. తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు.   ఈ సమయంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు , తేజస్సు మృగశిర కార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే ప్రాచీన వైద్యుడు.. తన గ్రంథాల్లో వివరించాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మృగశిర కార్తెలో ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి ఆశీర్వాదాలు పొందుదాం..!

►ALSO READ | టూల్స్ & గాడ్జెట్స్ : మీరు మర్చిపోయినా ఇది మర్చిపోదు.. మొక్కలకు నీళ్లు పోసే యంత్రం వచ్చేసింది..!

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.