. < 1 minute

అడ్లూరి లక్ష్మణ్​ అనే నేను..మంత్రిగా ప్రమాణ స్వీకారం

Caption of Image.

అడ్లూరి లక్ష్మణ్ అనే నేను.. అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అడ్లూరి లక్ష్మణ్ తో.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి   కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్​..  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపైనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గం నుండి తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో అనుహ్యంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది.ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. తాజాగా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోబోతున్నారు. ఇలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా జాక్‌పాట్ దక్కించుకుంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.