
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అయితే, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. భారత్ చెప్పినదాని కన్నా దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ పత్రాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించి ఒక నెల గడవడంతో నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్, మిలిటరీ అధిపతులు శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ 6 క్రిస్టల్ మేజ్ క్షిపణులతో పాకిస్తాన్ మురిడ్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని 6-7 స్కాల్ప్ క్షిపణులతో భారత్ నేలమట్టం చేసినట్లు తెలిసింది. ఆపరేషన్ సమయంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధ విమానాలు, సర్ఫేస్ టూ ఎయిర్(ఎస్ఏఎం) క్షిపణులు, ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థలు నాలుగు పాకిస్తాన్ నిర్మిత యుద్ధ విమానాలను, రెండు పెద్ద విమానాలు (బహుశా సీ-130జే, సాబ్ 2000 అవాక్స్ సిస్టమ్)ని కూల్చివేసినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్లోని సర్గోద, రఫికి, జకోబాబాద్, నూర్ ఖాన్ (చక్లాలా, రావల్పిండి)తో సహా 11 పాక్ ఎయిర్ బేస్లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడుల్లో 2 ఎఫ్-16 యుద్ధ విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంఘర్షణలో ఎస్-400 సిస్టమ్ మూడు శత్రు విమానాలను కూల్చేసింది. మే 10న జరిగిన ప్రతీకార దాడిలో పాకిస్తాన్ చక్లాలా నూర్ ఖాన్ ఎయిర్ బేస్లోని ఒక చైనీస్ LY-80 ఫైర్ రాడార్, రెండు AN/TPQ-43 US-నిర్మిత ఆటోమేటిక్ ట్రాకింగ్ రాడార్లు మరియు చైనీస్ HQ-9 రాడార్ యొక్క ఒక ఫైర్ యూనిట్ను ధ్వంసమైనట్లు సమాచారం.
Read Also: Tragedy : సె*క్స్కు ఒప్పుకోలేదు.. అందుకే చంపేశాం.. సూట్కేస్లో బాలిక మృతదేహం కేసులో సంచలనం
పాకిస్తాన్ భారత్పైకి చైనీస్ తయారీ 180 కి.మీ పరిధిని కలిగి ఉన్న PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని ప్రయోగించింది. అయితే, భారత రక్షణ వ్యవస్థలు వీటిని అడ్డుకున్నాయి. భారత్ 19 బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని, అంతే సంఖ్యలో స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణలను ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ చైనీస్ తయారీ JF-17 యుద్ధ విమానాలను ఉపయోగించి భారత వైమానిక స్థావరాలపై CM-400 AKG వైమానిక-ప్రయోగించిన సూపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించారు. అయితే, ఇవి మనకు ఎలాంటి నష్టాలను కలిగించలేకపోయాయి.
పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో ప్రయోగించిన టర్కీ-నిర్మిత YIHA లాయిటరింగ్ మందుగుండు సామగ్రిని భారత ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ జామ్ చేసింది. దీంతో వాటి లక్ష్యాలు తప్పిపోయాయి. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు వీటిని కూల్చేశాయి. పాకిస్తాన్ ప్రయోగించిన ఫతే-1 క్షిపణిని కూడా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి.
మే 7న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ జరిపిన దాడిలో మర్కజ్-ఎ-తైబా (మురిడ్కేలోని ఎల్ఇటి ప్రధాన కార్యాలయం) నాలుగు నుండి ఐదు క్రిస్టల్ మేజ్ క్షిపణులను ఉపయోగించింది. మర్కజ్-ఎ-సుభాన్ అల్లాహ్లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరంపై రాఫెల్ యుద్ధ విమానాల నుండి ప్రయోగించబడిన ఆరు స్కాల్ప్ క్షిపణులు దాడి చేశాయి, బంకర్-బస్టింగ్ పద్ధతులను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో జరిపిన దాడిలో పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. మే 7న ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి భారత వైమానిక దళం, భారత నేవీ ఇజ్రాయెల్ లాయిటరింగ్ మందుగుండు సామగ్రిని ఉపయోగించాయి.