. < 1 minute
DA Arrears: మా డీఏ బకాయిలు చెల్లించండి ప్లీజ్.. కేంద్రానికి ఉద్యోగుల డిమాండ్

తమ 18 నెలల డీఏ బకాయిలను చెల్లించాలని ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్లుగా తమ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 23, 2025న జరిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ స్టాండింగ్ కమిటీ 63వ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కరోనా మహమ్మారి సమయంలో నిలిపేసిన బకాయిలను చెల్లించాలనే డిమాండ్‌ను ఎన్‌సీ-జేసీఎం సిబ్బంది పక్షం గట్టిగా డిమాండ్ చేసింది. ఈ బకాయిలు జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు మూడు విడతల డీఏ/డీఆర్ పెంపుదలకు సంబంధించినవి. దేశవ్యాప్తంగా సంక్షోభ సమయంలో ఆర్థిక కఠినత చర్యలలో భాగంగా వీటిని స్తంభింపజేసారు.

కరోనా మహమ్మారి, సంక్షోభ సమయంలో ప్రవేశపెట్టిన వివిధ ఆర్థిక సంక్షేమ పథకాల ఫలితంగా ఏర్పడిన ఆర్థిక భారం కారణంగా నిలుపుదల చేసిన మొత్తాన్ని విడుదల చేయడం అసాధ్యమని ప్రభుత్వం పేర్కొంటుంది. కరోనాకు సంబంధించిన ఆర్థిక పతనం 2020-21 ఆర్థిక సంవత్సరం దాటి విస్తరించిందని ఇది తరుర్వాత సంవత్సరాల్లో బడ్జెట్ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం గుర్తించింది. సిబ్బంది పక్షం ఈ అంశాన్ని లేవనెత్తడం ఇదే మొదటిసారి కాదు. 2025 కేంద్ర బడ్జెట్‌కు ముందు ఎన్‌సీ-జేసీఎం ప్రతినిధులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక న్యాయం, పెరుగుతున్న జీవన వ్యయాలను పేర్కొంటూ పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయడాన్ని పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ సంవత్సరానికి రెండుసార్లు అంటే జనవరి, జూలై నెలల్లో వినియోగదారుల ధరల సూచికలో మార్పుల ఆధారంగా సవరిస్తారు. అయితే కరోనా కారణంగా ఏర్పడిన అనిశ్చితి మధ్య ప్రభుత్వం 18 నెలల పాటు డీఏ పెంపును స్తంభింపజేసింది. ఇది దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 లక్షలకు పైగా పెన్షనర్లపై ప్రభావం చూపింది. జూలై 2021 నుండి డీఏ పెంపుదల తిరిగి ప్రారంభించబడినా స్తంభింపజేసిన వాయిదాలను ఎప్పుడు చెల్లిస్తారో? పేర్కొనలేదు. దీని ఫలితంగా ఉద్యోగ సంఘాలు, సిబ్బంది సమాఖ్యలు వాటిని పునరుద్ధరించాలని స్థిరమైన డిమాండ్లు చేస్తున్నారు. 

జనవరి 2025లో ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించిన నేపథ్యంలో బకాయిల డిమాండ్ మరింత దృష్టిని ఆకర్షించింది. జనవరి 1, 2026 నుంచి అమలు చేయడానికి షెడ్యూల్ చేసిన ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, పెన్షన్, భత్య నిర్మాణాలను సమూలంగా మార్చాలని భావిస్తున్నారు. అయితే, దాని ఆమోదం ఉన్నప్పటికీ కమిషన్ యొక్క నిబంధనలు, దాని సభ్యుల అధికారిక నియామకం ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. పరిష్కరించని డీఏ బకాయిలతో సహా ఉద్యోగుల ఆందోళనలు కొత్త కమిషన్ ఆర్డర్‌లో చోటు ఇస్తారా? లేదా? అనే దానిపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.