
హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే రాజీనామా చేయడం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొందరి వ్యాఖ్యలు తనను బాధించాయని, తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ఇష్టారీతిన ప్రకటనలు జారీ చేస్తున్నారని సునీల్ నారంగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ మూడోసారి ఎన్నికైన 24 గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. సింగిల్ స్క్రీన్ థియేటర్ల గురించి ఇండస్ట్రీలో తలో మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఆ నలుగురు అనేది ఇపుడు లేదని.. అది 10 సంవత్సరాల క్రితం ఉండేదని చెప్పిన గంటల వ్యవధిలోనే సునీల్ నారంగ్ రాజీనామా చేయడం గమనార్హం.
సింగిల్ స్క్రీన్ల బంద్ బంద్ ఆలోచన వెనుక దిల్ రాజు, శిరీశ్, సురేశ్ బాబు, సునీల్ నారంగ్ ఉన్నారని అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ డ్రామా ‘డకాయిట్’కు సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘కుబేర’కు కూడా సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు.