
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ఆయన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించారు.
Also Read:Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు!
ప్రస్తుతం రామ్ చరణ్తో బుచ్చిబాబు సినిమా చేస్తున్న వెంకట సతీష్ కిలారు, తన వృద్ధి సినిమాస్ బ్యానర్లో రెండవ సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సంగతి పక్కన పెడితే, బాలకృష్ణ ఒక వైలెంట్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో ‘మార్కో’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా భారతీయ చిత్ర చరిత్రలోనే అత్యంత వైలెంట్ ఫిల్మ్గా గుర్తింపు పొందింది.
Also Read:Tollywood: ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ చెప్పిన 13 కోట్ల హీరో ఎవరు?
ఈ సినిమా విజయం సాధించిన కొద్ది రోజులకే దిల్ రాజు, దర్శకుడు హనీఫ్ అడేనికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దర్శకుడు బాలకృష్ణ కోసం ఒక పోలీస్ డ్రామా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా, బాలకృష్ణ కథ విన్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే, ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.