. < 1 minute

దత్తన్న ప్రజల మనిషి.. రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్నంత గౌరవం ఉంది: సీఎం రేవంత్

Caption of Image.

రాజకీయాల్లో వాజ్ పేయికి ఉన్న గౌరవం దత్తాత్రేయకు ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ప్రజల కథే నా ఆత్మకథ  బుక్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ సందర్బంగా  దత్తన్న అంటే ప్రజల మనిషి అని రేవంత్ కొనియాడారు. దత్తన్న ఏ పదవి చేపట్టినా సరైన న్యాయం చేశారని చెప్పారు.   గౌలిగూడ నుంచి హర్యానా గవర్నర్ గా ఎదిగారన్నారు. ఏ స్థాయిలో ఉన్నా దత్తన్న తన మూలాలు మర్చిపోలేద్నారు రేవంత్. గల్లీలో పేదలు పాన్ పరాక్ డబ్బా పెట్టుకున్నా దత్తన్న ఓపెనింగ్ కు వస్తారని చెప్పారు. 

దత్తన్న దగ్గర రాజకీయాల్లో స్కూలు పాఠాలు నేర్చుకున్నా.  చంద్రబాబు దగ్గర రాజకీయాల్లో   కాలేజ్  పాఠాలు నేర్చుకున్నా. రాహుల్ గాంధీ దగ్గర రాజకీయ ఉద్యోగం చేస్తున్నా.  ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దత్తన్న కార్యక్రమానికి హాజరయ్యా.  ఎంత ఉన్నత పదవిలో ఉన్నా దత్తన్న సామాన్యుడిగానే ఉన్నారు.  దత్తత్రాయే అలయ్ బలయ్ తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకం. ఈ వేదిక గవర్నర్ పరేడ్ లా ఉంది. దత్తాత్రయను  రాజకీయ నేతగా ప్రజలు చూడరు.  పీజేఆర్,దత్తాత్రేయ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. సామాన్యులకు ఏ కష్టం వచ్చినా గుర్తొచ్చే నేత దత్తాత్రేయ.  నేటి తరం నేతలకు దత్తాత్రేయ ఆదర్శమని అన్నారు రేవంత్. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.