. 2 minutes

ఐసీఐసీఐ బ్యాంకులో లక్కీ భాస్కర్ స్టోరీ.. కోట్లు కాజేసిన రిలేషన్షిప్ మేనేజర్.. ఎలా బయటపడిందంటే..

Caption of Image.

లక్కీ భాస్కర్ సినిమా చూసే ఉంటారు. చాలీ చాలని జీతం, అప్పులు, మధ్య తరగతి సమస్యలు.. వీటన్నింటిని నుంచి బయటపడేందుకు బ్యాంకు డబ్బును ఎలా వాడుకుని కోట్లు సంపాదిస్తాడు హీరో. ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యిందో ఏమో తెలియదు గానీ.. ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్ కోట్ల డబ్బులు కాజేసీ వార్తల్లోకెక్కింది. ఆ సినిమాలో బ్యాంకు డబ్బుతో కోట్లు సంపాదించి ‘లక్కీ’ భాస్కర్ అనిపించుకుంటే.. ఈమె నష్టపోయి ‘అన్ లక్కీ’గా మిగిలిపోయింది. ఐసీఐసీఐ బ్యాంకును షేక్ చేసిన ఈ మేనేజర్ ఆ డబ్బుతో ఏం చేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాజస్థాన్ కోటా లోని ఐసీఐసీఐ బ్రాంచ్ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా పనిచేస్తున్న స్వాతి గుప్తా దాదాపు 4.58 కోట్ల రూపాయలు కాజేసింది.  43 ఖాతాల నుంచి డబ్బును కొట్టేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది. తీసుకున్న అమౌంట్ మొత్తా్న్ని డబుల్, ట్రిపుల్ చేసి.. డిపాజిట్ చేయొచ్చు అనుకుంది కాబోలు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సాక్షి గుప్తా మొత్తం 110 అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసింది. అయితే బ్యాంకు అధికారులకు, ఖాతాదారులకు తెలియకుండా, ఎలాంటి మెసేజ్ అలెర్ట్ కూడా రాకుండా జాగ్రత్త పడటం పోలీసులను షాక్ కు గురిచేసింది. 

అకౌంట్లకు లింక్ చేసి ఉన్న మొబైల్ నెంబర్స్ మార్చడంతో ట్రాన్జాక్షన్స్ అలర్ట్స్ వెళ్లకుండా కంట్రోల్ చేసిందని పోలీసులు తెలిపారు. అదే విధంగా వివిధ అకౌంట్లకు సంబంధించిన పిన్ నెంబర్లను కూడా మార్చేసి డబ్బులు సింపుల్ గా డ్రా చేసినట్లు చెప్పారు.

అయితే ఎవరికీ డౌట్ రాకుండా.. గుట్టుచప్పుడు కాకుండా ఉండాలంటే మంచి ప్లాన్ వేసింది స్వాతి గుప్తా. వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ కు చెందిన అకౌంట్లనే టార్గెట్ చేసింది. డిజిటల్, మొబైల్ బ్యాంకింగ్ పైన అంతగా అవగాహన లేని సీనియర్ సిటిజన్స్ అకౌంట్స్ అయితే తను కొన్నాళ్లు సేఫ్ గా ఉండవచ్చు అని.. ఆ తర్వాత లాభాలు వచ్చాక మళ్లీ బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చునని సీనియర్ సిటిజన్స్ అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకోసం ఒక మహిళ అకౌంట్ కు వివిధ ఖాతాల నుంచి డబ్బంతా ట్రాన్స్ ఫర్ చేసి రూ.3 కోట్లు విత్ డ్రా చేసుకుంది. 

అంతే కాకుండా 31 మందికి చెందిన ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా ప్రి-క్లోజ్ చేసి రూ.1.34 కోట్లు డ్రా చేసుకుంది. మరో రూ.3.40 లక్షలను లోన్ గా తీసుకుంది. మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేసి లాస్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఎలా బయటపడిందంటే..

బ్యాంకులో రూ.1.50 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన ఒక కస్టమర్.. తన ఎమౌంట్ విత్ డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్తే ఈ బాగోతం బయటపడినట్లు పోలీసులు తెలిపారు . కస్టమర్ ఆథెంటికేషన్ లేకుండానే డబ్బంతా మరో అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు. దీంతో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో స్వాతి గుప్తాను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.