
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని మరోసారి నిరూపించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్తగా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యే వివేక్,అడ్లూరి లక్ష్మణ్,వాకిటి శ్రీహరికి విషెస్ చెప్పారు పొన్నం. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
కుల గణన చేస్తే ఏం లాభం అన్నవారికి ఇటీవల ఎమ్మెల్సీ ఇవ్వడం… ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించడం రాహుల్ గాంధీ ఆలోచనకు అద్దం పడుతుందన్నారు. రాహుల్ గాంధీ కుల గణన చేస్తే ఏం ప్రాధాన్యత ఉంటుంతో తెలంగాణలో రోల్ మోడల్ గా చూస్తున్నారని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ , కేసీ వేణుగోపాల్ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పొన్నం.
తెలంగాణ మంత్రివర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. జూన్ 8న రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు . అలాగే డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.