
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెకు తెలుగులోనూ సూపర్బ్ క్రేజ్ ఉంది. ‘కల్కి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మరో క్రేజీ ప్రాజెక్టులో జాయిన్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో హీరోయిన్గా దీపికను ఫైనల్ చేసినట్టు శనివారం ప్రకటించారు. ఈ సినిమాలో ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించగా చివరిగా దీపికను ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలో ఆమె ఆన్ బోర్డ్ అయినట్టు ప్రకటిస్తూ స్పెషల్ వీడియోతో వెల్కమ్ చెప్పారు.
‘మహా రాణి జయించడానికి వస్తోంది’ అంటూ రిలీజ్ చేసిన వీడియోలో దీపిక కత్తి పట్టి గుర్రంపై స్వారీ చేసే సీన్ను వీఎఫ్ఎక్స్లో చూపించారు. ఇందులో ఆమె ఎక్స్ప్రెషన్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. గతంలో షారుక్ ఖాన్ హీరోగా అట్లీ రూపొందించిన ‘జవాన్’ చిత్రంలో దీపిక నటించగా, అట్లీ డైరెక్షన్లో ఆమె చేస్తోన్న రెండో సినిమా ఇది. అల్లు అర్జున్ నటిస్తున్న 22వ చిత్రం, అలాగే అట్లీకి 6వ చిత్రం కావడంతో ‘ఏఏ22×ఏ6’ వర్కింగ్ టైటిల్తో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ఎండింగ్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేయనున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను ప్రకటిస్తామన్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.