
మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. కానీ.. చాలామంది వానాకాలంలో వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ.. వర్షం కురవనప్పుడు మర్చిపోకుండా నీళ్లు పోస్తేనే అవి పచ్చగా ఉంటాయి. అందుకోసం ఇలాంటి గాడ్జెట్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్పీఆర్3 ఎస్ఎస్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఇరిగేషన్ గాడ్జెట్ని బ్లూటూత్, వై-ఫై సాయంతో ఫోన్తోనే కంట్రోల్ చేయొచ్చు. అంటే.. ఇంటికి దూరంగా
ఉన్నప్పడు ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. గార్డెన్లో మొక్కలన్నింటికీ నీళ్లు అందుతాయి. ఈ గాడ్జెట్కి రెండు జోన్లు అంటే రెండు అవుట్ పుట్ పైపులు ఉంటాయి. దీన్ని గార్డెన్లోని ట్యాప్కి బిగించాలి. ఆ తర్వాత అవుట్పుట్ జోన్లకు స్ప్రేయర్ లేదా స్ర్పింక్లర్, డ్రిప్ పైపులను కనెక్ట్ చేయాలి. ఇందులో ఆటోమెటిక్ వాటర్ టైమర్ కూడా ఉంటుంది.
►ALSO READ | టూల్స్ & గాడ్జెట్స్ : చెవిలో గుబిలి తీయటానికి వచ్చిన కొత్త పరికరం ఇది..!
అంటే సెట్ చేసి పెట్టుకున్న టైంకి ప్రతిరోజూ నీళ్లను సప్లై చేస్తుంది. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే రెయిన్ డీలే ఫీచర్. అంటే వర్షం కురవని రోజు మాత్రమే నీళ్లు పంప్ చేస్తుంది. దీన్ని బ్లూటూత్తో ఆపరేట్ చేయాలంటే గాడ్జెట్కు 15 మీటర్లు పరిధిలోనే ఫోన్ ఉండాలి. లేదంటే వైఫై ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఎక్కడున్నా ఆపరేట్ చేయొచ్చు. దీన్ని యూఎస్బీ సాకెట్తో చార్జ్ చేసుకోవచ్చు.
ధర : రూ. 4,795