
పద్మారావునగర్, వెలుగు: ఛాతి నొప్పితో గాంధీ దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి తన సమస్యను డాక్టర్కు చూపించుకునేందుకు క్యూలో నిల్చునే ప్రాణాలు కోల్పోయాడు. బన్సీలాల్ పేట డివిజన్లోని చాచానెహ్రూ నగర్కు చెందిన జంగిటి నంద కిషోర్ ముదిరాజ్(37) ప్రైవేట్ఉద్యోగి. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. శుక్రవారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో గాంధీ దవాఖానలో ఓపీ తీసుకున్నాడు. కార్డియాలజీ డాక్టర్ను సంప్రదించగా ఈసీజీ తీసుకొని రమ్మని సూచించారు.
ఈసీజీ రిపోర్ట్ తీసుకొని తిరిగి డాక్టర్ వద్దకు వచ్చి క్యూలో నిల్చున్నాడు. ఈ క్రమంలో నిల్చున్న చోటే కుప్పకూలి మృతి చెందాడు. తీవ్రమైన గుండె నొప్పితో ఉన్న వ్యక్తిని ముందుగా చూడకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే తన భర్త చనిపోయాడని భార్య వాపోయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులను ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
హాస్టల్లో వ్యక్తి..
కూకట్పల్లి: కేపీహెచ్బీ పరిధిలోని మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందపడి మృతి చెందాడు. బాచుపల్లికి చెందిన శ్రావణ్కుమార్(42) కేపీహెచ్బీ పరిధి అడ్డగుట్ట సొసైటీలోని శ్రీనివాస మెన్స్పీజీ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హాస్టల్లో కుప్పకూలి చనిపోయాడు. పోలీసులు డెడ్బాడీని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు.