
దేశంలో ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా సర్కార్ వైద్యం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, భయాందోళన కనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఒడిశాలోని ఒక గవర్నమెంట్ ఆస్పత్రిలో నర్సు చేసిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మరువక ముందే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మరో దిగ్భ్రాంతికరమైన, హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డ శవాన్ని.. ఓ వీధి కుక్క నోట్లో పెట్టుకుని పరిగెడుతున్న దృశ్యాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వీధి కుక్క హల్చల్ చేసింది. నవజాత శిశువు మృతదేహం నోట్లో కరుచుకుని ఉన్న ఒక కుక్క ఆస్పత్రిలో యద్ధేచ్ఛగా తిరుగుతూ కనిపించింది. ఈ సంఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది.
ఇండోర్లోని మోవ్ తహసీల్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కుక్క నోట్లో నవజాత శిశువు మృతదేహంలో ఒక భాగాన్ని పట్టుకుని తిరుగుతూ కనిపించింది. ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నవజాత శిశువును కుక్క చంపిందా లేదా చనిపోయి పుట్టిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పరిస్థితి స్పష్టమవుతుందని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఆసుపత్రి యాజమాన్యం సీసీటీవీ ఫుటేజ్, వాస్తవాలను దాచిపెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని గ్రహించిన ప్రాంతీయ ఆరోగ్య శాఖ డైరెక్టర్ షాజీ జోసెఫ్, వైద్యుల దర్యాప్తు బృందాన్ని ఆసుపత్రికి పంపారు. దర్యాప్తు బృందం నివేదిక కోసం అంతా వేచి ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..