. < 1 minute
Pawankalyan Single Screens Owners Are Angry At Veeramallu

పవన్‌ కల్యాణ్‌ నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ, తొలి భాగం జూన్ 12న రిలీజ్ కానున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ, ఈసారి కూడా కష్టమేనని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమాతో భారీ లాభాలు వస్తాయని ఆశించారు. కానీ అందరీ ఆశలపై నీళ్లు జల్లుతూ ఈ మూవీ మేకర్స్ అన్నంతపని చేశారు.. రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు.

Also Read : Balakrishna : ‘అఖండ 2’ బిగ్ అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్..

దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సినీ రంగానికి చెందిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ శ్రీధర్ కూడా ఈ చిత్ర వివాదంపై కామెంట్స్ చేశారు.. ‘వాయిదా అనే ఇష్యూ క్రియేట్ చేసింది ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు డైరెక్టర్స్ మాత్రమే. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉందని ప్రతి థియేటర్ కాలి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నెల అంతా పోయినట్లే. ఈ ఏడాదిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కోర్టు’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలు మాత్రమే హిట్లుగా నిలిచాయి. హీరోలకు స్టార్‌డమ్ వచ్చిందే సింగిల్ స్క్రీన్స్ వల్ల.. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్‌ను వారు పట్టించుకోవడం లేదు’ అని ఆయన మండిపడ్డారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.