. < 1 minute

కొత్త మంత్రులకు సీఎం రేవంత్ విషెస్ ..మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రమాణం..

Caption of Image.

తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లకు  సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే డిప్యూటీ స్పీకర్ గా  ప్రమాణ స్వీకారం చేయనున్న రామచంద్రు నాయక్ కు  కూడా ఫోన్ చేశారు సీఎం రేవంత్ . 

 జూన్ 8న రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి  రావాలని ఉండాలని చెప్పారు. 11.45 వరకు రాజ్ భవన్ లో అందుబాటులో ఉండాలని తెలిపారు. రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు . గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వీళ్లతో ప్రమాణం చేయించనున్నారు.  కొత్త మంత్రుల జాబితా రాజ్ భవన్ కు చేరడంతో   ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మరో మూడు పెండింగ్​

రాష్ట్ర కేబినెట్​లో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా.. ప్రస్తుతం మూడు బెర్త్​లను భర్తీ చేయనున్నారు. ఆదివారం మృగశిర కార్తె కావడం, మంచి ముహూర్తం ఉండడంతో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన మూడు  బెర్త్​లను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో శనివారం సాయంత్రం సీఎం రేవంత్​రెడ్డి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడినట్టు తెలిసింది. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గవర్నర్​ హైదరాబాద్​కు బయలుదేరారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న మూడు మంత్రి పదవుల్లో ఎస్సీ మాల (వివేక్​ వెంకటస్వామి), ఎస్సీ మాదిగ (కవ్వంపల్లి సత్యనారాయణ), బీసీ ముదిరాజ్ (వాకిటి శ్రీహరి)కు దక్కాయి. కాగా.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్  సమావేశమై.. కేబినెట్​ విస్తరణపై చర్చించారు. అనంతరం విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​కు తెలియజేశారు. ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే , అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.