ముఖ్యంగా టీ తాగిన తర్వాత బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టీ తాగిన తర్వాత పండ్లు తినకూడదు. టీలో ఉండే టానిన్లు పండ్లలోని పోషకాలను శరీరం గ్రహించకుండా ఆపుతాయి. ఇది గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.
టీ తాగిన వెంటనే చల్లని పదార్థాలు తినడం తాగడం వంటివి చేస్తే ఎన్నో పొట్ట సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. టీ తాగిన తర్వాత చల్లని పదార్థాలు తినడం మానుకోవాలి. వేడి టీ తాగిన తర్వాత చల్లనివి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. టీ తాగిన తర్వాత పెరుగు, మజ్జిగ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. టీ తాగిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగితే.. దగ్గు, జలుబు వంటివి వస్తాయి. టీ తాగిన తర్వాత ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు.
చాలా మందికి టీ తాగుతూ వేడి వేడి బజ్జీలు, బోండా, పకోడి వంటివి తినడం అలవాటు. కానీ, అది ఇబ్బందిగా మారుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఇలా తీసుకోవడం చాలా మందికి ఇష్టం. కానీ, ఇలా తినటం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఎప్పుడో ఓసారి అయితే పర్లేదు. ఇలా నూనెలో వేయించిన పదార్థాలు తరచూ తీసుకుంటూ ఉంటే.. పేగుల్లో పుండ్లు మొదలై.. పేగు క్యాన్సర్ వంటి సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.
కొంతమందిలో టీ తాగిన తర్వాత పండ్లు తినడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజు టీ తాగే వారు ఈ విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.