
Andrew Sandham Triple Century Record: క్రికెట్ చరిత్రలో కొన్ని ఇన్నింగ్స్లు చిరస్మరణీయం. అలాంటి వాటిలో ఒకటి 39 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ ప్లేయర్ ఒకరు సాధించారు. అది నేటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. సాధారణంగా 39 ఏళ్ల వయసులోపు అంతర్జాతీయ క్రికెటర్లు రిటైర్మైంట్ ప్రకటిస్తుంటారు. కానీ, ఈ వయసులో తన దేశం తరపున క్రికెట్ ఆడటమే కాకుండా, ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించిన బ్యాట్స్మన్గా ఈ ప్లేయర్ అరుదైన రికార్డ్ సాధించాడు. ప్రపంచంలోని కొద్దిమంది బ్యాట్స్మెన్స్ మాత్రమే దీన్ని చేయగలిగారు. ఏకంగా 10 గంటల పాటు క్రీజులో ఉండి బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. ఆసక్తికరంగా, అతను తన చివరి టెస్ట్ మ్యాచ్లో ఈ అద్భుతం చేయడం గమనార్హం. ఆ బ్యాట్స్మన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
39 సంవత్సరాల వయసులో ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ బ్యాట్స్మన్ పేరు ఆండీ సాంధమ్. ఈ మాజీ ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ కేవలం పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు, కానీ అది చారిత్రాత్మక ట్రిపుల్ సెంచరీ. ఎందుకంటే అతను టెస్ట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మన్ అయ్యాడు. ఆండీ సాంధమ్ ఇంగ్లాండ్కు చెందిన అనుభవజ్ఞుడైన బ్యాట్స్మన్. 1930లో వెస్టిండీస్ పర్యటనలో అతను ఈ ఘనత సాధించాడు. అప్పటి వరకు వెస్టిండీస్ తన తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేయకపోవడంతో ఈ పర్యటన అనేక విధాలుగా చారిత్రాత్మకమైనది. జమైకాలోని కింగ్స్టన్లో జరిగిన నాల్గవ మరియు చివరి టెస్ట్ మ్యాచ్లో సాంధమ్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు, ఇది డ్రాగా ముగిసింది. ఇది అతని కెరీర్లో చివరి టెస్ట్ కూడా.
ఆ రోజుల్లో టెస్ట్ క్రికెట్ ఐదు రోజులు కాకుండా, ‘టైమ్ లెస్’ టెస్టులు ఆడేవారు. అంటే, ఒక ఫలితం తేలేంత వరకు మ్యాచ్ కొనసాగేది. అలాంటి పరిస్థితుల్లో, ఆండీ శాండమ్ బ్యాటింగ్ విన్యాసం నిజంగా అద్భుతం. ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగి, శాండమ్, లెస్ అమెస్తో కలిసి ఐదవ వికెట్కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత లెస్ అమెస్ అవుట్ అయినా, శాండమ్ మాత్రం వెనకడుగు వేయలేదు. గెరాల్డ్ లెగె (Gerard Legge) తో కలిసి ఆరో వికెట్కు 154 పరుగులు, వాలీ హమ్మండ్ (Wally Hammond) తో కలిసి 111 పరుగులు, కెప్టెన్ పెర్సీ చాప్మన్ (Percy Chapman) తో కలిసి 100 పరుగులు జోడించాడు.
వెస్టిండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని, వారిని పూర్తిగా అలసిపోయేలా చేశాడు శాండమ్. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేస్తూ, ప్రతి బంతిని అంచనా వేసి ఆడుతూ, శాండమ్ 325 పరుగుల భారీ స్కోరును సాధించాడు. ఈ ఇన్నింగ్స్ మొత్తం 640 నిమిషాల (దాదాపు 10 గంటల 40 నిమిషాలు) పాటు సాగింది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ట్రిపుల్ సెంచరీగా రికార్డుల్లో నిలిచింది. అతని 325 పరుగుల ఇన్నింగ్స్లో 28 ఫోర్లు ఉన్నాయి.
ఆండీ శాండమ్ ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ, టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా అతని పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది. అతని ఈ అద్భుతమైన ప్రదర్శన, టెస్ట్ క్రికెట్కు ఒక కొత్త ప్రమాణాన్ని, ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది బ్యాటింగ్ పరాక్రమానికి, టెస్ట్ క్రికెట్లో సుదీర్ఘంగా నిలబడటానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..