
మహబూబాబాద్ జిల్లాలో ఓ కొత్త జంటకు ఊహించని విధంగా జాక్ పాట్ తగిలింది.. ప్రధానమంత్రిని పెళ్లికి రావాలని లేఖ పంపిన ఆ జంటకు ఊహించని కానుక అందింది. ఏకంగా ప్రధాన మంత్రి సంతకంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ అందింది. ఆ జంట ఊహించని కానుకతో ఆనందం తో ఉప్పొంగిపోతున్నారు.
ప్రధాని మోదీ నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటారు. మోదీ నిర్ణయాలు సామాన్యులకు షాకింగ్ కలిగిస్తాయి. దేశ రక్షణలోనైనా, ప్రజా వలయం లో, పరిపాలన లోనైనా ఆయన రూటే సెపరేట్. తాజాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంకు చెందిన ఓ నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త జంటను దీవిస్తూ.. ప్రధాని సంతకంతో లేఖ వచ్చింది. దీన్ని చూసిన నూతన జంట, ఇరు కుటుంబసభ్యుల ఆనందంకు అవధులు లేవు.
వీడియో చూడండి..
బయ్యారం మండల కేంద్రంకు చెందిన శివకుమార్ వివాహం మే 23వ తేదీన నిశ్చయమైంది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పెళ్లికి రావాలని లేఖ రాశాడు. ఆ లేఖను ప్రధాని కార్యాలయానికి పోస్టు చేశాడు. దీనికి బదులుగా శనివారం(జూన్ 07) రోజు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి నూతన జంటను దీవిస్తూ.. మీరు నిండా నూరేళ్లు కలిసి మెలిసి ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని ఆశీర్వదిస్తూ ప్రధాని మోదీ పేరుతో లేఖ అందింది. ప్రధానమంత్రి రిప్లై చూసిన కొత్త జంట ఆనందంలో మునిగి తేలుతోంది.. సామాన్యుడి పట్ల మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధకు జిల్లా ప్రజలు అవాక్కువుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..